Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:53 PM

బొబ్బిలి పట్టణంలోని సాయినగర్‌ కు చెందిన నాయుడు జగదీశ్‌కుమార్‌(30) సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ మంగమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదీశ్‌కుమార్‌ ఆదివారం రాత్రి స్థానిక ఐటీఐ కాలనీలో తన స్నేహితుని ఇంటి వద్ద నుంచి బైకుపై తిరిగి వస్తుండగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై అదుపు తప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొనడంతో పెద్ద పూలకుండీ తగిలి జగదీశ్‌ కుమార్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

బొబ్బిలి, జూన్‌ 10: బొబ్బిలి పట్టణంలోని సాయినగర్‌ కు చెందిన నాయుడు జగదీశ్‌కుమార్‌(30) సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ మంగమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదీశ్‌కుమార్‌ ఆదివారం రాత్రి స్థానిక ఐటీఐ కాలనీలో తన స్నేహితుని ఇంటి వద్ద నుంచి బైకుపై తిరిగి వస్తుండగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై అదుపు తప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొనడంతో పెద్ద పూలకుండీ తగిలి జగదీశ్‌ కుమార్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 4.30 గంటలకు కన్నుమూశాడు. మృతునికి తల్లిదండ్రులు సత్యనారాయణ, సోదరుడు ఉన్నారు. జగదీష్‌ కుమార్‌ టీడీపీ కార్యకర్తకు పార్టీకి ఎంతో సేవ చేశారని సీనియర్‌ టీడీపీ నేత రౌతు రామ్మూర్తి తెలిపారు. మృతదేహానికి విజయనగరం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. హెచ్‌సీ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగమ్మ వివరించారు.

Updated Date - Jun 10 , 2024 | 11:53 PM