Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:03 AM

మండలం అవనాం సమీప జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన బుడ్డుపు వెంకటేష్‌(33) మృతి చెందినట్లు ఎస్‌ఐ పి.సూర్యకుమారి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

భోగాపురం, జూన్‌ 9: మండలం అవనాం సమీప జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన బుడ్డుపు వెంకటేష్‌(33) మృతి చెందినట్లు ఎస్‌ఐ పి.సూర్యకుమారి తెలిపారు. హైద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్న వెంకటేష్‌ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు విశాఖ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్క డ చికిత్స అనంతరం తిరిగి కారులో స్వగ్రామానికి బయలుదే రారు. విశాఖ - శ్రీకాకుళం రోడ్డులో మార్గమధ్యలో అవనాం జంక్షన్‌ వద్ద మూత్రవిసర్జన నిమిత్తం కారు దిగి రోడ్డు దాటుతుండగా అదే సమ యంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో వెంక టేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సూర్యకుమారి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సామా జిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుడికి భార్య శ్రీలేఖతో రెండు సంవత్స రాల క్రితమే వివాహం అయ్యింది.

Updated Date - Jun 10 , 2024 | 12:03 AM