రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:15 AM
చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం జి.అగ్రహారానికి చెందిన కోట్ల నవీన్ (28) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
![రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చీపురుపల్లి: చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం జి.అగ్రహారానికి చెందిన కోట్ల నవీన్ (28) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే స్టేషన్కు సమీపంలోని ఆరు ఖానాల వద్ద నవీన్ మృత దేహాన్ని గుర్తించిన కొంతమంది కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. నవీన్ ఆత్మ హత్యకు కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.