లారీ ఢీకొని మహిళ మృతి
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:21 AM
లారీ ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన పాలకొండలోని పురటా ల పోలమాంబ ఆలయానికి ఎదురుగా ఆదివారం చోటుచేసుకుంది.
![లారీ ఢీకొని మహిళ మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పాలకొండ: లారీ ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన పాలకొండలోని పురటా ల పోలమాంబ ఆలయానికి ఎదురుగా ఆదివారం చోటుచేసుకుంది. వీరఘట్టం మండలం విక్రంపురం గ్రామానికి చెందిన డోటు అనూరాధ(41) తన భర్త శ్రీనివా సరావుతో కలిసి స్వగ్రామం నుంచి సరుబుజ్జిలి మండలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. పాలకొండ రహదారిలోని పురటాల పోలమాంబ ఆలయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అనూరాధ ద్విచక్ర వాహనం నుంచి జారి కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పాలకొండ పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. కళ్ల ముందే భార్య మృతి చెందడంతో శ్రీనివా సరావు బోరున విలపించాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.