Share News

కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:44 PM

ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్ననాయుడుకు జిల్లా ప్రజలు సోమవారం ఘన స్వాగతం పలికారు.

కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం
కేంద్ర, రాష్ట్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే అదితి

కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం

విజయనగరం రూరల్‌, జూన్‌ 17: ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్ననాయుడుకు జిల్లా ప్రజలు సోమవారం ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టాక వారు మొదటిసారిగా స్వగ్రామం వెళ్తూ భోగాపురం మండలం పోలిపల్లి గ్రామ సమీపం లేఅవుట్‌ వద్ద కొద్దిసేపు ఆగారు. టీడీపీ జిల్లా నాయకులు వారిని గజమాలతో సన్మానించారు. వేల సంఖ్యలో అభిమానులు, నాయకులు హాజరయ్యారు. అనంతరం భోగాపురం నుంచి శ్రీకాకుళం వెళ్లారు. అంతకుముందు విశాఖలో వారిని ఎమ్మెల్యే అదితిగజపతిరాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 17 , 2024 | 11:44 PM