Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:54 PM

సీతంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక లక్ష్మ ణరావు(72) సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యుత్‌ బిల్లు కట్టడానికి సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్‌కు వెళ్లాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సీతంపేట: సీతంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక లక్ష్మ ణరావు(72) సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యుత్‌ బిల్లు కట్టడానికి సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్‌కు వెళ్లాడు. బిల్లు కట్టి తిరిగి ఇంటికి బయలుదేరాడు. ముగ్గురు యువకులు ఎదురుగా ద్విక్రవాహనంపై వచ్చి లక్ష్మణరావును బలంగా ఢీకొట్టారు. దీంతో లక్ష్మణరావు రోడ్డుపై ఎగిరిపడిపో యాడు. బలంగా తలకు గాయం తగలడంతో వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రి కి తరలించగా మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లక్ష్మణరా వుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మణరావు మృతి చెందడంతో కు టుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:54 PM