Share News

కనీస పెన్షన్‌ను రూ.9 వేలు చెల్లించాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:03 AM

కనీస పెన్షన్‌ను 9 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 6, 7, 8 తేదీల్లో ఆందోళనలు చేపడుతున్నట్లు ఆల్‌ పెన్సనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి..శేషగిరిరావు, పి.శంకరరావు తెలిపారు.

కనీస  పెన్షన్‌ను రూ.9 వేలు చెల్లించాలి

బొబ్బిలి: కనీస పెన్షన్‌ను 9 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 6, 7, 8 తేదీల్లో ఆందోళనలు చేపడుతున్నట్లు ఆల్‌ పెన్సనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి..శేషగిరిరావు, పి.శంకరరావు తెలిపారు. వచ్చే నెల 6 నుంచి మూడు రోజులపాటు ఢిల్లీ జంతర్‌మంతర్‌లో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలకు తరలిరావాలని కోరారు. ఈ మేరకు శనివారం స్థానిక తారకరామాకాలనీ జంక్షన్‌లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు భుజంగరావు, కృష్ణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:03 AM