గడ్డివాముల దగ్ధంపై కేసు నమోదు
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:12 AM
మండలంలోని జే.గుమడాంలో మంగళవారం మధ్యాహ్నం గడ్డి వాములు దగ్ధమైన ఘటనకు సంబంధించి బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కే.లక్ష్మణరావు బుధవారం తెలిపారు.
బొండపల్లి: మండలంలోని జే.గుమడాంలో మంగళవారం మధ్యాహ్నం గడ్డి వాములు దగ్ధమైన ఘటనకు సంబంధించి బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కే.లక్ష్మణరావు బుధవారం తెలిపారు. గ్రా మానికి చెందిన రైతు మోపాడ శ్రీనివాసరావుకు చెందిన 15 గడ్డివాములు దగ్ధమవడానికి గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి మహేష్ కారణమని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.