Share News

యువకుడిపై కేసు నమోదు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:09 AM

ప్రేమంచి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరితో పెళ్లికి సి ద్ధమైన యువకుడిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ లక్ష్మణరావు బుధవారం తెలిపారు.

యువకుడిపై కేసు నమోదు

బొండపల్లి: ప్రేమంచి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరితో పెళ్లికి సి ద్ధమైన యువకుడిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ లక్ష్మణరావు బుధవారం తెలిపారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం కొండభీమపురం గ్రామానికి చెందిన తుంపల్లి ఢిల్లీశ్వరరావు విజయ వాడలో 2021 సంవత్సరంలో ఒక కంపెనీలో పనిచేసేవారు. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని ఢీల్లీశ్వర రావు నమ్మించాడు. కానీ తనను కాకుండా వేరే యువతితో పెళ్లికి సిద్ధం కావ డంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదుచేసి యువకుడిని రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 12:09 AM