96,673 మందికి పోలియో చుక్కలు
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:26 PM
జిల్లాలో 98,991 మంది చిన్నారులకు గాను ఆదివారం 96,673 (97.65 శాతం) మందికి పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్వో జగన్నాథరావు తెలిపారు.
పార్వతీపురం(ఆంధ్రజ్యోతి)/సాలూరు రూరల్: జిల్లాలో 98,991 మంది చిన్నారులకు గాను ఆదివారం 96,673 (97.65 శాతం) మందికి పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్వో జగన్నాథరావు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్య, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారని చెప్పారు. కలెక్టర్ నిశాంత్కుమార్ పార్వతీపురంలో పలువురి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జగన్నాథరావు, ఐటీడీఏ ఉపఆరోగ్యశాఖాధికారి శివకుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.