96 శాతం పోలింగ్ పూర్తి
ABN , Publish Date - May 08 , 2024 | 10:55 PM
జిల్లాలోని నాలుగు ఫెసిలిటేషన్ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 96 శాతం మేర పోలింగ్ పూర్తయ్యింది.
![96 శాతం పోలింగ్ పూర్తి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పార్వతీపురం, మే8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాలుగు ఫెసిలిటేషన్ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 96 శాతం మేర పోలింగ్ పూర్తయ్యింది. కాగా బుధవారం పార్వతీపురంలో 171, సాలూరులో 89, పాలకొండలో 138, కురు పాంలో 159 చొప్పున ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని మరో రోజు పొడిగించినట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ తెలిపారు. గురువారం కూడా ఉద్యోగులు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.