Share News

కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ సందడి

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:39 PM

కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి మహిళా దినోత్సవ సందడి నెలకొంది. ఏపీ జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ విజయసునీత కేకును కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు, ఎస్‌సీడీసీ భవానీ, ఏవో అరుణకుమారిలకు శాలువాలు కప్పి సత్కరించారు.

కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ సందడి
కలెక్టరేట్‌లో కేకు కట్‌ చేస్తున్న విజయసునీత

పాడేరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి మహిళా దినోత్సవ సందడి నెలకొంది. ఏపీ జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ విజయసునీత కేకును కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు, ఎస్‌సీడీసీ భవానీ, ఏవో అరుణకుమారిలకు శాలువాలు కప్పి సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా జేఏసీ ప్రతినిధులు పి.జగ్గయమ్మ, ఎస్‌.శాంతికుమారి, జె.వెంకటలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:39 PM