రెండో ఈవీఎంను ఎప్పుడు వినియోగిస్తారంటే!
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:48 AM
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల స్థానం లో ఈవీఎం (ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్)లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
ఉక్కుటౌన్షిప్, ఏప్రిల్ 18:
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల స్థానం లో ఈవీఎం (ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్)లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఒక నియోజకవర్గంలో 16 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే రెండో ఈవీఎంను వినియోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఈవీఎంలో 16 మంది వివరాలు మాత్రమే రికార్డు చేసేందుకు వీలుంటుంది. అంతకన్నా ఎక్కువ మంది బరిలో ఉంటే తప్పకుండా మరో ఈవీఎంను ఉపయోగించాలి. ఉదాహరణకు 18 మంది అభ్యర్థులు రంగంలో ఉంటే మొదటి ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు, రెండో ఈవీఎంలో ఇద్దరు వివరాలు ఉంచుతారు. దీంతో పాటు ఏ పోలింగ్ బూత్లోనైనా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత మధ్యలో ఈవీఎం మొరాయిస్తే అప్పటివరకు నమోదైన వివరాలను సీల్ చేసి, రెండో ఈవీఎంను వినియోగిస్తారు.