Share News

కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మిస్తాం

ABN , Publish Date - May 24 , 2024 | 11:59 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుందరయ్యపేటలో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మిస్తామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మిస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న కొణతాల రామకృష్ణ

కొత్తూరు, మే 24 : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుందరయ్యపేటలో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మిస్తామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హామీ ఇచ్చారు. శుక్రవారం మండలంలోని సుందరయ్యపేటలో పార్టీ నేతలు, బూత్‌ కమిటీ ప్రతినిధులు, కార్యకర్తలతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్‌ 4 తరువాత రాష్ట్రలో ఏర్పడేది కూటమి ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. మొండిపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసి, ఆ ప్రాంతంలో ఆర్‌వో ప్లాంటును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాక్షస పాలన అంతం చేసేందుకు ప్రజలంతా కసితో కూటమికి ఓటు వేశారని చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు రేఖా రమణమూర్తి, రాపేటి రాము, చందక నర్సింగ్‌, ఎంపీటీసీ సభ్యుడు చదరం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:59 PM