అరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాం
ABN , Publish Date - Mar 14 , 2024 | 11:23 PM
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల నుంచి సీపీఎం పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. గురువారం అరకులోయలో ఓ ప్రైవేటు రిసార్టు సమావేశ మందిరంలో అల్లూరి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు అప్పలనర్స ఆధ్వర్యంలో నిర్వహించారు.
![అరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాం](https://media.andhrajyothy.com/media/2024/20240313/14ark1_33c982588c.jpg)
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
అరకులోయ, మార్చి 14: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల నుంచి సీపీఎం పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. గురువారం అరకులోయలో ఓ ప్రైవేటు రిసార్టు సమావేశ మందిరంలో అల్లూరి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు అప్పలనర్స ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అభ్యర్థులను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు లోకనాథం, సురేంద్ర, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.