Share News

అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాం

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:23 PM

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల నుంచి సీపీఎం పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. గురువారం అరకులోయలో ఓ ప్రైవేటు రిసార్టు సమావేశ మందిరంలో అల్లూరి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు అప్పలనర్స ఆధ్వర్యంలో నిర్వహించారు.

అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాం
మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

అరకులోయ, మార్చి 14: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల నుంచి సీపీఎం పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. గురువారం అరకులోయలో ఓ ప్రైవేటు రిసార్టు సమావేశ మందిరంలో అల్లూరి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు అప్పలనర్స ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అభ్యర్థులను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు లోకనాథం, సురేంద్ర, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 11:23 PM