Share News

హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:10 AM

జాతీయ రహదారి పక్కనే సంగివలసలో వైసీపీ ఎన్నికల సభ ఏర్పాటుచేయడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

జనాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనాలు జాతీయ రహదారిపైనే నిలిపివేత

దీంతో అటు అవంతి కళాశాల నుంచి ఇటు ఆనందపురం వరకు ట్రాఫిక్‌ జామ్‌

విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి):

జాతీయ రహదారి పక్కనే సంగివలసలో వైసీపీ ఎన్నికల సభ ఏర్పాటుచేయడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సభకు జనాలను తీసుకువచ్చిన బస్సులు, ప్రైవేటు వాహనాలను రహదారిపైనే నిలిపివేశారు. లారీలు, ఇతర వాహనాలను సర్వీస్‌ రోడ్డులోకి మళ్లించారు. సాయంత్రం ఆరు గంటలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రసంగం ముగిసిన తరువాత ఒక్కసారిగా సభా ప్రాంగణం నుంచి కార్యకర్తలు జాతీయ రహదారిపైకి వచ్చారు. అప్పటివరకూ వారిని తిరిగి తీసుకువెళ్లేందుకు ఏర్పాటుచేసిన బస్సులు రోడ్డుపైనే నిలిపి ఉంచడంతో...ఇటు అవంతి కళాశాల నుంచి అటు అనందపురం వరకూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

Updated Date - Jan 28 , 2024 | 01:10 AM