Share News

వైభవంగా నూకాంబిక జాతర ప్రారంభం

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:42 PM

స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర బాలాలయంలో ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి ఆలయ ఈవో బండారు ప్రసాద్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి జాతర పూజను ఈవో ప్రారంభించారు.

వైభవంగా నూకాంబిక జాతర ప్రారంభం
అమ్మవారికి పట్టువస్త్రాలు ఇస్తున్న ఈవో ప్రసాద్‌

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 7: స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర బాలాలయంలో ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి ఆలయ ఈవో బండారు ప్రసాద్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి జాతర పూజను ఈవో ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

నేటి సాయంత్రం ఐదు గంటల వరకే దర్శనం

కొత్త అమావాస్య సందర్భంగా సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకే భక్తులకు నూకాంబిక అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఈవో బండారు ప్రసాద్‌ తెలిపారు. అమావాస్య సందర్భంగా బాలాలయంలో అమ్మవారికి అమావాస్య పూజ చేస్తామన్నారు. ఈ పూజ కారణంగా ఐదు గంటల వరకే భక్తులకు దర్శనం కల్పించి ఆలయం మూసివేస్తామన్నారు. తిరిగి మంగళవారం తెల్లవారుజాము ఆరు గంటల నుంచి బాలాలయంలో అమ్మవారి దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 11:42 PM