Share News

తగ్గని భానుడి ప్రతాపం

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:17 AM

మన్యంలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. కొయ్యూరులో బుధవారం 40.8 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో సైతం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై తొమ్మిది గంటల తరువాత తీవ్రత అధికమవుతున్నది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై సంచరించేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గుతున్నప్పటికీ ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నది. తాజా వేడి వాతావరణానికి ఏజెన్సీ వాసులు అవస్థలు పడుతున్నారు.

తగ్గని భానుడి ప్రతాపం
బుధవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా ఉన్న పాడేరు- అరకులోయ జాతీయ రహదారి

- కొయ్యూరులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

పాడేరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. కొయ్యూరులో బుధవారం 40.8 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో సైతం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై తొమ్మిది గంటల తరువాత తీవ్రత అధికమవుతున్నది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై సంచరించేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గుతున్నప్పటికీ ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నది. తాజా వేడి వాతావరణానికి ఏజెన్సీ వాసులు అవస్థలు పడుతున్నారు.

ఉష్ణోగ్రతలు ఇలా..

కొయ్యూరులో బుధవారం 40.8 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అనంతగిరిలో 36.2, అరకులోయలో 36.4, చింతపల్లిలో 37.2, డుంబ్రిగుడలో 39.4, జీకే వీధిలో 38.2, జి.మాడుగులలో 38.8, హుకుంపేటలో 35.4, ముంచంగిపుట్టులో 37.4, పాడేరులో 38.2, పెదబయలులో 37.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 18 , 2024 | 01:17 AM