ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:17 AM
ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కింతాడ గ్రామానికి చెందిన బండారు శివ (35) శనివారం పొలంలో వరి దమ్ము దున్నుతుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది.

కె.కోటపాడు, జూలై 27 : ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కింతాడ గ్రామానికి చెందిన బండారు శివ (35) శనివారం పొలంలో వరి దమ్ము దున్నుతుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో శివ ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె.కోటపాడు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. మృతుడు శివకు భార్య చంద్రకళ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శివ మృతితో కింతాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.