అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు
ABN , Publish Date - May 23 , 2024 | 12:46 AM
వచ్చే నెల 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నర్సీపట్నం డీఎస్పీ జీఆర్ఆర్.మోహన్ హెచ్చరించారు.
![అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు](https://media.andhrajyothy.com/media/2024/20240511/22srvm1_2cdd901b69.jpg)
ఎస్.రాయవరం, మే 22 : వచ్చే నెల 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నర్సీపట్నం డీఎస్పీ జీఆర్ఆర్.మోహన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని రేవుపోలవరం, దార్లపూడి తదితర గ్రామాలను సందర్శించిన ఆయన ప్రజలతో మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటలను జరక్కుండా సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎస్ఐ విభీషణరావు ఉన్నారు.