ఆశ్రమ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:37 PM
ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ఆదేశించారు. మండలంలోని కె.కోడాపల్లి పంచాయతీ బంధవీధి బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిక్రూమ్ను తనిఖీ చేశారు.

ఐటీడీఏ పీవో అభిషేక్ ఆదేశం
బంధవీధి బాలికల ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ
అనారోగ్యంతో ఉన్న విద్యార్థినులను ఆస్పత్రికి తరలింపు
జి.మాడుగుల, మార్చి 6: ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ఆదేశించారు. మండలంలోని కె.కోడాపల్లి పంచాయతీ బంధవీధి బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిక్రూమ్ను తనిఖీ చేశారు. ఇక్కడి ఐదుగురు విద్యార్థునులు అనారోగ్యంతో ఉన్నట్టు గుర్తించారు. వారిని స్వయంగా ఆటోలో స్థానిక సీహెచ్సీకి తరలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు స్వగ్రామాలకు తీసుకువెళ్లాడానికి ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో పంపించవద్దని ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు వడ్డించారు. మెనూను పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పీవో వెంట ఏటీడబ్ల్యూవో తిరుపాల్, పాఠశాల సిబ్బంది వున్నారు.