Share News

ప్రతిభ చూపారు

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:58 PM

గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన ఇద్దరు గిరి యువకులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఐటీడీఏ, 21 సెంచరీ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత సివిల్స్‌ కోచింగ్‌ పొందున్న సీదరి శ్రీను, గుజ్జెలి కమల్‌భార్గవ్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపి మెయిన్స్‌కు ఎంపికయ్యారు.

ప్రతిభ చూపారు

గ్రూప్‌- 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన గిరి యువకులు

ఫలితమిచ్చిన ఐటీడీఏ ఉచిత సివిల్స్‌ కోచింగ్‌

పాడేరు, ఏప్రిల్‌ 13(ఆంఽధ్రజ్యోతి): గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన ఇద్దరు గిరి యువకులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఐటీడీఏ, 21 సెంచరీ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత సివిల్స్‌ కోచింగ్‌ పొందున్న సీదరి శ్రీను, గుజ్జెలి కమల్‌భార్గవ్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపి మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరిద్దరూ మెయిన్స్‌లోనూ సత్తా చాటుతారని ఐటీడీఏ పీవో అభిషేక్‌, కోచింగ్‌ నిర్వాహుకులు ధరణి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఐటీడీఏ పూర్వ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఉచిత సివిల్స్‌ కోచింగ్‌ ప్రవేశపెట్టడంతో అనేకమంది గిరిజన యువతకు ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కలుగుతోందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 13 , 2024 | 11:58 PM