Share News

వణికిస్తున్న చలి

ABN , Publish Date - Nov 24 , 2024 | 10:37 PM

మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పది రోజులుగా గిరిజన ప్రాంతలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

వణికిస్తున్న చలి
జీకేవీధి-చింతపల్లి మార్గంలో కురుస్తున్న మంచు

జి.మాడుగులలో 10.5, డుంబ్రిగుడలో 10.8 డిగ్రీలు నమోదు

చింతపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పది రోజులుగా గిరిజన ప్రాంతలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం జి.మాడుగులలో 10.5, డుంబ్రిగుడలో 10.8, అరకులోయలో 11, ముంచంగిపుట్టులో 12.1, హుకుంపేటలో 12.5, జీకేవీధిలో 13, పెదబయలులో 13.1, పాడేరులో 13,6, చింతపల్లి, అనంతగిరిలో 14.2, కొయ్యూరులో 17.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గిరిజన ప్రాంతంలో ప్రస్తుతం ఉదయం, రాత్రి వేళల్లో మంచు దట్టంగా కురుస్తున్నది.

Updated Date - Nov 24 , 2024 | 10:37 PM