శభాష్ సుందరపు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:58 AM
విద్యుత్ సరఫరాకు రెండు సార్లు అంతరాయం కలిగినా అధికారులపై అసహనం వ్యక్తం చేయకుండా సెల్ఫోన్ టార్చి వెలుతురులో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మండల సమావేశం నిర్వహించడం అందరి మన్ననలు అందుకుంది.

మండల సమావేశం నిర్వహిస్తున్నప్పుడు రెండు సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం
అధికారులపై అసహనం వ్యక్తం చేయకుండా సెల్ఫోన్ టార్చి వెలుతురులో సమావేశం కొనసాగించిన ఎమ్మెల్యే
విజయకుమార్ తీరుకు పలువురి అభినందన
ఎలమంచిలి, జూలై 4: విద్యుత్ సరఫరాకు రెండు సార్లు అంతరాయం కలిగినా అధికారులపై అసహనం వ్యక్తం చేయకుండా సెల్ఫోన్ టార్చి వెలుతురులో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మండల సమావేశం నిర్వహించడం అందరి మన్ననలు అందుకుంది. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ బోదెపు గోవింద్ అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశానికి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలో రెండుసార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయినా విద్యుత్ అధికారులపై ఎమ్మెల్యే ఎటువంటి అసహనం వ్యక్తం చేయకుండా సెల్ఫోన్ టార్చి వెలుతురులో సమావేశాన్ని కొనసాగించారు. ఆయన తీరును పలువురు అభినందించారు.