శభాష్ ‘మేధ’ర్షి!
ABN , Publish Date - Mar 18 , 2024 | 12:39 AM
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో మండలంలోని నునపర్తి గ్రామానికి చెందిన రెడ్డి మేధర్షి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది జనవరి 28వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించగా, ఈ నెల 14వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి.
![శభాష్ ‘మేధ’ర్షి!](https://media.andhrajyothy.com/media/2024/20240313/M_Reddy_2_b21120b675.jpg)
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో నునపర్తి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
283/300 మార్కులు సాధించిన రెడ్డి మేధర్షి
జాతీయస్థాయిలో 43వ ర్యాంకు
అచ్యుతాపురం, మార్చి 17: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో మండలంలోని నునపర్తి గ్రామానికి చెందిన రెడ్డి మేధర్షి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది జనవరి 28వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించగా, ఈ నెల 14వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. రెడ్డి మేధర్షి 283/300 మార్కులతో జాతీయ స్థాయిలో 43వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు రాజేశ్, స్వర్ణలత ఉద్యోగరీత్యా హైదరాబాద్లో వుంటున్నారు. మేధర్షి రెగ్యులర్ పాఠశాలకు వెళుతూనే ఆన్లైన్లో వైజాగ్ సైనిక్ అకాడమీ సెంటర్లో కోచింగ్ తీసుకున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు.