Share News

జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:26 PM

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలో ఎన్నికల నిర్వణ, ముందస్తు ఏర్పాట్లు, పనులపై సమీక్ష జరిపారు.

జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ఎస్పీ కేవీ మురళీకృష్ణ, తదితరులు

అనకాపల్లి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలో ఎన్నికల నిర్వణ, ముందస్తు ఏర్పాట్లు, పనులపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ఎస్పీ కేవీ మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు హాజరై జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ విజయభాస్కర్‌, డీఆర్‌వో దయానిధి, ఎస్‌డీసీ సుబ్బలక్ష్మి, డీఎస్‌వో మూర్తి, డీఎంహెచ్‌వో హేమంత్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నోడల్‌ అధికారి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:26 PM