మార్కెట్ కమిటీ పాలకవర్గం రాజీనామా
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:49 AM
అనకాపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గం తమ పదవులకు మంగళవారం రాజీనామా చేసింది.
![మార్కెట్ కమిటీ పాలకవర్గం రాజీనామా](https://media.andhrajyothy.com/media/2024/20240604/11akp_town_4_b97b18edb3.jpg)
అనకాపల్లి టౌన్, జూన్ 11: అనకాపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గం తమ పదవులకు మంగళవారం రాజీనామా చేసింది. ఈ మేరకు మార్కెట్ కమిటీ కార్యదర్శి శకుంతల వివరాలు వెల్లడించారు. మార్కెట్కమిటీ చైర్మన్గా గొల్లవిల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కరక సోమునాయుడు, సభ్యులు నీటిపల్లి లక్ష్మి, మరిపల్లి శోభ, బొబ్బిలి శ్యామల, కటారి దుర్గ, బొడ్డు జయ, దాడి తులసీకుమారి, ఈగల నూకరత్నం, తెరపల్లి లక్ష్మి, దాడి కుమార్ వరహా కృష్ణ, ఒమ్మి మోదినాయుడు, కోలపర్తి కన్నబాబు, గుండా రమేష్గుప్తా, గొంతిన శివలు తమ రాజీనామా పత్రాలను అందజేశారని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ప్రజా తీర్పును గౌరవిస్తూ, తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశామని చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు తెలిపారు.
ఎలమంచిలిలో నామినేటెడ్ పదవులకు...
ఎలమంచిలి: నియోజకవర్గంలో పలువురు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేసినట్టు మంగళవారం ప్రకటించారు. ఎలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు క్యాంపు కార్యాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్, రాంబిల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు యు.సుకుమార్వర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎర్రయ్యదొర, కొక్కిరాపల్లి, దిమిలి, దప్పుతూరు, లక్కవరం, మునగపాక, తిమ్మరాజుపేట, పెదపాడు, చూచుకొండ పీఏసీఎస్ చైర్మన్లు మళ్ళ కొండబాబు, సిరసపల్లి రామారావు, శెట్టి నాగేశ్వరరావు, జంపన అచ్చుతరామరాజు, కోనపల్లి రామ్మోహనరావు, కాండ్రేగుల అప్పారావు, జనపరెడ్డి శ్రీనివాసరావు, పెంటకోట హరేరామ్ తమ పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను మీడియా ఎదుట ప్రదర్శించారు.