Share News

స్టీల్‌ప్లాంట్‌లో కార్మిక సమ్మె వాయిదా

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:18 AM

స్టీల్‌ప్లాంట్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో చేపట్టాలనుకున్న కార్మిక సమ్మెను వాయిదా వేసినట్టు ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్‌లు పేర్కొన్నారు.

స్టీల్‌ప్లాంట్‌లో కార్మిక సమ్మె వాయిదా

ఉక్కుటౌన్‌షిప్‌, జనవరి 24: స్టీల్‌ప్లాంట్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో చేపట్టాలనుకున్న కార్మిక సమ్మెను వాయిదా వేసినట్టు ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్‌లు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు నూతన వేతన సవరణ చేయాలని, ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు మరో 16 అంశాలను పరిష్కరించాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12న ఉక్కు యాజమాన్యానికి నాయకులు సమ్మె నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ కార్మిక సంఘాలు ఢిల్లీలో లేబర్‌ కమిషనర్‌తో సమావేశమవ్వగా.. త్వరలోనే ఆయా సమస్యల పరిష్కారానికి హామీ రావటంతో సమ్మెను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 12:18 AM