ప్రశాంతంగా టెట్
ABN , Publish Date - Feb 28 , 2024 | 01:32 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తొలిరోజు ప్రశాంతంగా జరిగింది.
![ప్రశాంతంగా టెట్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తొలిరోజు 86.8 శాతం హాజరు
ఆరిలోవ, ఫిబ్రవరి 27:
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తొలిరోజు ప్రశాంతంగా జరిగింది. మంగళవారం నగరంలోని ఏడు కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించారు. తొలిరోజు పరీక్షకు 4,420 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా...3837 (86.8 శాతం) మంది హాజరయ్యారు. 583 మంది మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారిణి చంద్రకళ పలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.