మే 1 నుంచి పవన్కల్యాణ్ పర్యటన
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:39 AM
జనసేన అధినేత పవన్కల్యాణ్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
జనసేన అధినేత పవన్కల్యాణ్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఒకటో తేదీన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి, పెందుర్తి, రెండో తేదీన విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూడో తేదీన పాలకొండ, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.