రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , Publish Date - May 06 , 2024 | 01:09 AM
పాడేరు- విశాఖ ఘాట్లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఎస్ఐ జి.లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పాడేరు మండలం తుంపాడ పంచాయతీ గడ్డంపుట్టు గ్రామానికి చెందిన ముడువ సింహాచలం(29), నీలయ్యదొర వెంకటతేజ(19), పాంగి జీవన్కుమార్(18)లు పాడేరు ఘాట్ మార్గంలోని కాఫీ తోటల పరిసర ప్రాంతాల్లో వంట చెరకు తెచ్చుకొనేందుకు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- పాడేరు ఘాట్లో బైక్ను జీపు ఢీకొనడంతో ప్రమాదం
పాడేరురూరల్, మే 5: పాడేరు- విశాఖ ఘాట్లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఎస్ఐ జి.లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పాడేరు మండలం తుంపాడ పంచాయతీ గడ్డంపుట్టు గ్రామానికి చెందిన ముడువ సింహాచలం(29), నీలయ్యదొర వెంకటతేజ(19), పాంగి జీవన్కుమార్(18)లు పాడేరు ఘాట్ మార్గంలోని కాఫీ తోటల పరిసర ప్రాంతాల్లో వంట చెరకు తెచ్చుకొనేందుకు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పాడేరు- విశాఖ ఘాట్ రోడ్డు డైమండ్ పార్కు సమీపానికి వచ్చే సరికి చోడవరం నుంచి పాడేరుకు ప్రయాణికులతో వస్తున్న జీపు వీరి బైక్ను బలంగా ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న సింహాచలం తలకు బలమైన గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతనితో ఉన్న మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానికులు 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. జీపు డ్రైవర్ ప్రమాద స్థలంలో వాహనాన్ని విడిచి పరారయ్యాడు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు.