Share News

ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదు

ABN , Publish Date - Mar 22 , 2024 | 01:22 AM

ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు ఇచ్చేది లేదని, రెగ్యులర్‌ ఉద్యోగులు, సిబ్బంది వివరాలను శాఖల వారీగా నివేదించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు.

ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మల్లికార్జున

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు ఇచ్చేది లేదని, రెగ్యులర్‌ ఉద్యోగులు, సిబ్బంది వివరాలను శాఖల వారీగా నివేదించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. అత్యవసర సేవల్లో ఉండేవారు తప్ప మిగిలిన వారంతా ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిందేని పేర్కొన్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌, సిబ్బంది కేటాయింపు, ఇతర అంశాలపై చర్చించేందుకు గురువారం ఆయన కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశ మయ్యారు. ఉద్యోగులు, సిబ్బంది వివరాలు నిర్ణీత కాలంలో అందజేయాలని, ఇప్పటికే ఇచ్చిన సమాచారంలో మార్పులు, చేర్పులు ఉంటే ముందుగా తెలియజేయాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అందరూ సహకారం అందించా లన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌, మానవ వనరుల విభాగం కేటాయింపుల నోడల్‌ అధికారి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 01:22 AM