ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ముగిసిన గడువు
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:28 AM
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదు బుధవారంతో ముగిసింది. చివరిరోజు ఆఫ్లైన్, ఆన్లైన్ రెండింటిలో కలిపి మూడువేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తం దరఖాస్తులు 10,777కు చేరాయి. అయితే దరఖాస్తులపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 23వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. అదేరోజు నుంచి మరోసారి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు.
విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదు బుధవారంతో ముగిసింది. చివరిరోజు ఆఫ్లైన్, ఆన్లైన్ రెండింటిలో కలిపి మూడువేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తం దరఖాస్తులు 10,777కు చేరాయి. అయితే దరఖాస్తులపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 23వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. అదేరోజు నుంచి మరోసారి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు.