Share News

క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:47 AM

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని సింహాద్రి ఎన్టీపీసీ సీజీఎం సంజయ్‌కుమార్‌ సిన్హా అన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న సింహాద్రి ఎన్టీపీసీ సీజీఎం సంజయ్‌కుమార్‌ సిన్హా

పరవాడ, జూన్‌ 11 : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని సింహాద్రి ఎన్టీపీసీ సీజీఎం సంజయ్‌కుమార్‌ సిన్హా అన్నారు. ప్లాంట్‌కు చెందిన దీపాంజలినగర్‌లోని క్రీడా ప్రాంగణంలో సోమవారం రాత్రి వాలీబాల్‌, త్రోబాల్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో రామగుండం, కుడ్గి, తెలంగాణ, సదరన్‌ రీజియన్‌ హెచ్‌ క్యూ, సింహాద్రి ప్లాంట్‌కు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీలు ఆధ్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. మూడు రోజులు పాటు పోటీలు కొనసాగుతాయన్నారు. తొలుత క్రీడాకారులందరిని సీజీఎం పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి సీపీజీ-3 విభాగం సీజీఎం ఆర్‌ఆర్‌ పరిదా, వివిధ విభాగాల జీఎంలు డేవిడ్‌, వీటీ కాంబ్లే, ఎస్‌.పద్మప్రియ, బీబీ పాత్ర, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:47 AM