Share News

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:50 AM

వేపగుంట సమీపంలోని సంతోష్‌నగర్‌లో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక మనస్తాపంతో ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
సత్యశాంతి (ఫైల్‌ ఫొటో)

వేపగుంట, మార్చి 21: వేపగుంట సమీపంలోని సంతోష్‌నగర్‌లో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక మనస్తాపంతో ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్‌నగర్‌లో గండ్రెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తి భార్యత సత్యశాంతి (34), పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. సత్యశాంతి పండుగ చీటీలు నిర్వహించేది. చీటీలు కట్టిన వారికి పండుగ నాడు నిత్యావసర సరకులు, స్వీట్లు ఇస్తుండేది. చీటీల ద్వారా వచ్చిన నగదును ఇతరులకు వడ్డీలకు ఇచ్చేంది. అలా అప్పులు తీసుకున్న వ్యక్తులు ఇటీవల సక్రమంగా నగదు చెల్లించకపోవడం.. చీటీలు కట్టిన వారంతా నెల రోజులుగా సత్యశాంతి ఇంటికి వచ్చి నిలదీస్తుండడంతో మనస్తాపానికి గురయ్యేది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం భర్త బయటకు వెళ్లాగా, ఆమె పిల్లలతో కలిసి వేపగుంటలోని బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ నుంచి పిల్లల కన్నా ముందుగానే ఇంటికి వచ్చేసి ఉరి వేసుకుంది. సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తల్లి తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లారు. ఉరి వేసుకున్న ఆమెను వెంటనే గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే సత్యశాంతి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాతా తన భార్య మృతికి ఇద్దరు వ్యక్తులే కారకులని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:50 AM