తాడిలో వైసీపీ నుంచి జనసేనలో చేరికలు
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:44 AM
తాడి గ్రామానికి చెందిన 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలోకి చేరారు. ఈమేరకు తాడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్బాబు వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
పరవాడ, ఏప్రిల్ 19 : తాడి గ్రామానికి చెందిన 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలోకి చేరారు. ఈమేరకు తాడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్బాబు వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. జనసేనలోకి చేరిన వారిలో కోమటి సూరిబాబు, గనిరెడ్డి కనకరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పైలా జగన్నాథరావు, అనకాపల్లి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కన్నూరు వెంకటరమణ, మాజీ సర్పంచ్ బొడ్డపల్లి అప్పారావు పాల్గొన్నారు. అలాగే కలపాక పంచాయతీ పరిధి వైసీపీకి చెందిన పలువురు వార్డు మెంబర్లు , కార్యకర్తలు జనసేనలోకి చేరారు. వీరందరికీ పంచకర్ల ప్రసాద్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మోటూరి సన్యాసినాయుడు, నగిరెడ్డి చిన్నారావు, జనపాల రాము పాల్గొన్నారు.