నేడు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:42 AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది.
రాత్రి 9 గంటలకు తుని నుంచి పాయకరావుపేటలోకి ప్రవేశం
నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు వద్ద బస
పాయకరావుపేట, ఏప్రిల్ 18: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది. కాకినాడ జిల్లా తునిలో పర్యటన ముగించుకుని రాత్రి 9 గంటలకు జాతీయ రహదారి మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తారు. వై జంక్షన్ వద్ద స్వాగతం పలకడానికి ఏర్పాటు చేస్తున్నట్టు వైసీపీ నాయకులు చెప్పారు. అనంతరం జాతీయ రహదారి మీదుగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.