నేడు అనకాపల్లి జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:47 AM
ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది.
నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు వద్ద రాత్రి బస
పాయకరావుపేట, ఏప్రిల్ 18:
ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది. కాకినాడ జిల్లా తునిలో పర్యటన ముగించుకుని రాత్రి తొమ్మిది గంటలకు జాతీయ రహదారి మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఆయన జాతీయ రహదారి మీదుగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మే 1 నుంచి పవన్కల్యాణ్ పర్యటన
విశాఖపట్నం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
జనసేన అధినేత పవన్కల్యాణ్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఒకటో తేదీన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి, పెందుర్తి, రెండో తేదీన విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూడో తేదీన పాలకొండ, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.