Share News

తుది ఓటర్ల జాబితాలో అవకతవకలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:11 AM

అనకాపల్లి జిల్లాలో తుది ఓటర్ల జాబితాలో అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం రాత్రి డీఆర్‌వో బి. దయానిధిని కలిసి కోరారు.

తుది ఓటర్ల జాబితాలో అవకతవకలు
ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై డీఆర్‌వోతో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

పూర్తిస్థాయిలో విచారణ జరపాలి

డీఆర్‌ఓకు మాజీ మంత్రి అయ్యన్న వినతి

అనకాపల్లి కలెక్టరేట్‌, జనవరి 29 : అనకాపల్లి జిల్లాలో తుది ఓటర్ల జాబితాలో అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం రాత్రి డీఆర్‌వో బి. దయానిధిని కలిసి కోరారు. తుది ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పుల గురించి డీఆర్వోకు ఆయన వివరించారు. జాబితాల్లో ఉన్న లోపాలకు సంబంధించి తగిన ఆధారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ నాయకులు మళ్ల సురేంద్ర, సిరసపల్లి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 01:11 AM