నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల అమ్మకం
ABN , Publish Date - Mar 24 , 2024 | 01:22 AM
నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి టికెట్ల అమ్మకాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
![నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల అమ్మకం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్కు నేటి నుంచి ఆన్లైన్లో విక్రయం
ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్కు ఈనెల 27 నుంచి...
టికెట్ల ధరలు: రూ.1,000, 1,500, 2,000, 3,000, 3,500, 5,000, 7,500
విశాఖపట్నం (స్పోర్ట్సు), మార్చి 23:
నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి టికెట్ల అమ్మకాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్కు సంబంధించిన టికెట్ల విక్రయాలు పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి చేపట్టనున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది. ఈనెల 31న ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్కింగ్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు టికెట్ల అమ్మకాలు ఈనెల 27 నుంచి జరుగుతాయని పేర్కొంది. టికెట్ల ధరలను రూ.1,000, రూ.1500, రూ.2000, రూ.3,000, రూ.3,500, రూ.5,000, రూ.7,500గా నిర్ణయించింది. కాగా, ఆన్లైన్ టికెట్లను మామూలు టికెట్లుగా మార్చుకునేందుకు నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఏసీఏ-వీడీసీఏ ‘బి’ గ్రౌండ్లో కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినవారు ఈనెల 26 నుంచి, ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్కు ఆన్లైన్ టికెట్ పొందినవారు ఈనెల 27 నుంచి ఆయా కేంద్రాల్లో మార్చుకోవాలని స్పష్టం చేశారు. కాగా టికెట్ల ధరలు క్రీడాభిమానులలో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ప్రారంభ టికెట్ ధర రూ.1000 కావడంతో ఆలోచనలో పడుతున్నారు.