స్ర్టాంగ్ రూమ్ల తనిఖీ
ABN , Publish Date - May 22 , 2024 | 12:34 AM
పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల ఈవీఎంలను భద్రపరిచిన స్థానిక ప్రభుత్వం డిగ్రీ కళాశాలలోని స్ర్టాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత, ఎస్పీ తుహిన్సిన్హా మంగళవారం రాత్రి తనిఖీ చేశారు.
![స్ర్టాంగ్ రూమ్ల తనిఖీ](https://media.andhrajyothy.com/media/2024/20240511/21pdr4_f91e7e55e2.jpg)
- భద్రతపై కలెక్టర్, ఎస్పీ ఆరా
పాడేరు, మే 21(ఆంధ్రజ్యోతి): పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల ఈవీఎంలను భద్రపరిచిన స్థానిక ప్రభుత్వం డిగ్రీ కళాశాలలోని స్ర్టాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.విజయసునీత, ఎస్పీ తుహిన్సిన్హా మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్లకు కల్పించిన సీఆర్పీఎఫ్ భద్రతపై ఆరా తీసి, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఇతరులెవ్వరూ స్ట్రాంగ్ రూమ్ల వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదన్నారు. అలాగే కౌంటింగ్ నిర్వహించే జూన్ నెల 4వ తేదీ వరకు ప్రత్యేక భద్రతా చర్యలు కొనసాగించాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.