Share News

రాంబిల్లిలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు

ABN , Publish Date - May 20 , 2024 | 11:16 PM

మండల కేంద్రంలోని మహాలక్ష్మిమెట్ట వద్ద అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

రాంబిల్లిలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు
రాంబిల్లి మహాలక్ష్మిమెట్ట వద్ద రాత్రి వేళల్లో గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన దృశ్యం

రాంబిల్లి మే 20 : మండల కేంద్రంలోని మహాలక్ష్మిమెట్ట వద్ద అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో గ్రావెల్‌కు గిరాకీ ఉండడంతో స్థానికంగా ఉన్న కొందరు ట్రాక్టర్ల యజమానులు మహాలక్ష్మిమెట్ట వద్ద గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రతి రోజూ రాత్రి వేళల్లో ఎక్స్‌కవేటర్‌తో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కొద్ది రోజులుగా తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ గ్రావెల్‌ రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయానికి అతి సమీపంలోనే గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను నిలుపుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 20 , 2024 | 11:16 PM