Share News

మన్యంలో భారీ వర్షం

ABN , Publish Date - May 08 , 2024 | 12:33 AM

మన్యంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణంలో మార్పులతో ఆకాశమంతా కారు మబ్బులు కమ్మేసింది.

మన్యంలో భారీ వర్షం
వర్షానికి తడిసి ముద్దయిన పాడేరు అంబేడ్కర్‌ సెంటర్‌

- అరకులోయలో 28.4 ఎం.ఎం వర్షపాతం నమోదు

మన్యంలో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

పాడేరు, మే 7(ఆంధ్రజ్యోతి): మన్యంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణంలో మార్పులతో ఆకాశమంతా కారు మబ్బులు కమ్మేసింది. దీంతో చీక టి వాతావరణం ఏర్పడడంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. సుమారుగా గంటన్నరపాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

అరకులోయలో 28.4 మిల్లీమీటర్ల వర్షపాతం

మన్యంలో మంగళవారం భారీ వర్షం కురవడంతో అరకులోయలో అత్యధికంగా 28. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జి.మాడుగులలో 18.6, ముంచంగిపుట్టులో 18.2, కొయ్యూరులో 18, పెదబయలులో 14.6, అనంతగిరిలో 14.2, పాడేరులో 11,2, చింతపల్లిలో 6.4, హుకుంపేటలో 4.2, డుంబ్రిగుడలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

మన్యంలో మంగళవారం కురిసిన భారీ వర్షం ప్రభావంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులతో పోలిస్తే ఒకటి నుంచి రెండు డిగ్రీలు తగ్గాయి. అనంతగిరిలో 38.7 అరకులోయలో 38.0, చింతపల్లిలో 36.8, డుంబ్రిగుడలో 39.2, జీకే8వీధిలో 39.6, జి.మాడుగులలో 39.5, హుకుంపేటలో 39.6, ముంచంగిపుట్టులో 36.2, పాడేరులో 33.8, పెదబయలులో 36.7 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 08 , 2024 | 12:33 AM