ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి
ABN , Publish Date - Nov 11 , 2024 | 11:27 PM
దేశంలో తొలి విద్యాశాఖ మంత్రి, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని సోమవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్గౌడ, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాడేరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దేశంలో తొలి విద్యాశాఖ మంత్రి, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని సోమవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్గౌడ, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, మైక్రో ఇరిగేషన్ పీడీ ఎంఏ రహీమ్, వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ మొహిద్దీన్, స్థానిక ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.