Share News

ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:51 AM

ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయి కోరారు.

ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న చినబ్బాయి

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 11 : ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయి కోరారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే జీవో నంబరు 117ను రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిందన్నారు. ఆ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంలో ఉన్న మాదిరిగా మూడంచెల విధానంలోనే పాఠశాలలను ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి, ఉపాధ్యక్షులు కట్టా శ్రీను, గాయిత్రి, కార్యదర్శులు చంద్రరావు, జీఎస్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:51 AM