Share News

కేజీబీవీలో జీసీడీవో రాత్రి బస

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:02 AM

జిల్లా గర్ల్స్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారిణి (జీసీడీవో) పద్మావతి సోమవారం రాత్రి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించారు.

కేజీబీవీలో జీసీడీవో రాత్రి బస
సోమవారం రాత్రి స్టడీ అవర్‌లో విద్యార్థినులతో జీసీడీవో పద్మావతి

కోటవురట్ల, ఫిబ్రవరి 27: జిల్లా గర్ల్స్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారిణి (జీసీడీవో) పద్మావతి సోమవారం రాత్రి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించారు. విద్యార్థినుల కోసం వండిన భోజన పదార్థాలను రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. స్టోర్‌రూమ్‌లో సరుకులు, రికార్డులను తనిఖీ చేశారు. తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థినులతో మాట్లాడి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారు. పరీక్షల సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వుండాలని సూచించారు. సోమవారం రాత్రి విద్యాలయం ప్రత్యేక అధికారిణి సరితాదేవి, విద్యార్థినులతో కలిసి వసతిగృహంలో బసచేశారు. మంగళవారం ఉదయం యోగా తరగతులను పరిశీలించారు. స్టడీ ఆవర్‌లో పదో తరగతి పాఠ్యాంశాలకు సంబంధించి బాలికల సందేహాలను నివృత్తి చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 12:02 AM