Share News

నేడు భీమిలిలో గంటా నామినేషన్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:59 AM

భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం నామినేషన్‌ వేస్తున్నారు.

నేడు భీమిలిలో గంటా నామినేషన్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం నామినేషన్‌ వేస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని తన ఇంటి వద్ద ఉదయం 10.54 గంటలకు నామినేషన్‌పై సంతకాలు చేసి, భీమిలి బయలుదేరి వెళతారు. ఆయనతో పాటు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, టీడీపీ నాయకులు కోరాడ రాజబాబు, జనసేన నాయకులు పంచకర్ల సందీప్‌, ఇతర నాయకులు ఉంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భీమిలిలో నామినేషన్‌ సమర్పించి, అక్కడికి సమీపంలోని ఎనిమిది ఎకరాల్లో భారీ సమావేశం నిర్వహిస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 01:59 AM