పదవీ విరమణ పొందిన ఎస్ఐలకు వీడ్కోలు
ABN , Publish Date - May 31 , 2024 | 11:51 PM
జిల్లాల పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది శుక్రవారం పదవీ విరమణ పొందారు.
![పదవీ విరమణ పొందిన ఎస్ఐలకు వీడ్కోలు](https://media.andhrajyothy.com/media/2024/20240530/31akprural2_765af8de6c.jpg)
అనకాపల్లి రూరల్, మే 31: జిల్లాల పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది శుక్రవారం పదవీ విరమణ పొందారు. స్పెషల్ బ్రాంచ్లో ఎస్ఐలుగా పనిచేస్తున్న ఎం.రామకృష్ణ, కె.వెంకటరావు, రావికమతం పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న డి. అప్పారావులను జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ ముగ్గురు పోలీస్ శాఖలో అంకితభావంతో మంచి సేవలందించారని, సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు విజయభాస్కర్, సత్యనారాయణరావు పాల్గొన్నారు.