Share News

నగరానికి ఎనిమిది మంది సీఐలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:19 AM

విశాఖ రేంజ్‌లో ఉన్న ఎనిమిది మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను సిటీకి కేటాయిస్తూ ఐజీ హరికృష్ణ ఉత్తర్వులు జారీచేశారు.

నగరానికి ఎనిమిది మంది సీఐలు

విశాఖపట్నం,జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖ రేంజ్‌లో ఉన్న ఎనిమిది మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను సిటీకి కేటాయిస్తూ ఐజీ హరికృష్ణ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో సీనియర్‌ అధికారులు ఎ.పార్థసారధి, జి.గోవిందరావుతోపాటు వారం క్రితం పదోన్నతి పొందిన కల్లూరి శ్రీనివాసరావు, ఊయక రమేష్‌, గుబ్బల శ్రీనివాసరావు, అమిత ప్రసాదరావు, గొల్లు అర్జున్‌, ఎల్‌. రామకృష్ణ ఉన్నారు. వీరందరికీ నగర పోలీస్‌ కమిషనర్‌ పోస్టింగ్స్‌ ఇవ్వనున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 01:19 AM