మత్తు పదార్థాల రవాణాను అరికట్టాలి
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:35 AM
సమాజానికి హానికారిగా వున్న మత్తుపదార్థాల రవాణాను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
- కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం
పాడేరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): సమాజానికి హానికారిగా వున్న మత్తుపదార్థాల రవాణాను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలని, ఇందులో భాగంగా మత్తు పదార్థ్ధాల రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. అందుకు అవసరమైన చర్యలను పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అధికారులు పటిష్ఠంగా చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల రవాణా జరగకూడదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎం.విజయసునీత, ఎస్పీ తుహిన్సిన్హా, ఎస్ఈబీ విభాగం అధికారులు పాల్గొన్నారు.